
.webp)
తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని చీటికాడ, తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అల్పపీడన ద్రోణి కారణంగా రాబోయే రెండు రోజులు పలు జిల్లాల్లో ఉములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ అకాల వర్షాల వల్ల కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
