
.webp)
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ లియాబేటరీ సేవలు త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ గుర్తించారు. భక్తులకు సురక్షితమైన, మంచి నాణ్యత కలిగిన ప్రసాదాలు, ఆహారం కోసం వీలుగా ఈ లయను అత్యాధునిక పరికరాలు/యంత్రాలతో సిద్ధం చేస్తున్నారు. రూ.25 కోట్లతో ఏర్పాటవుతున్న ఈ ల్యాబ్లో స్వామి వారి ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, బాదంపప్పు, శనగలు, చక్కెర, యాలకులు, పసుపు, కారం వంటి ఆరవై రకాల ముడిసరకులు, ప్రసాదాలను నాణ్యతగా పరీక్షిస్తారని చెప్పారు.
తిరుమలలోని ఫుడ్ ల్యాబ్రేటరీ పనులు 90% వరకు పూర్తయ్యాయని మంత్రి చెప్పారు. ఈ ల్యాబ్ కార్యకలాపాలు వచ్చేనెల నుండి ప్రారంభాయని అని. కల్తీని నెయ్యిని దృష్టిలో ఉంచుకుని ఈ ల్యాబ్లో ప్రత్యేకంగా ఈ-టంగ్ అండ్ ఈ- నోస్ (ఎలక్ట్రానిక్ నోరు- ఎలక్ట్రానిక్ ముక్కు) మిషన్లను రూ.3.5 కోట్లతో సమకూర్చబోతున్నామని పేర్కొన్నారు. నెయ్యి నాణ్యతలో అత్యంత సూక్ష్మంగా లోపం ఉన్నా… ఈ-టంగ్ అండ్ ఈ-నోస్ యంత్రాలు పసిగడతాయని తెలిపారు. ఇవి అందుబాటులోకి రావడానికి మే వరకు సమయం పట్టే అవకాశం ఉందని సూత్రప్రాయంగా మంత్రి సత్యకుమార్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఉన్నారు.
అక్టోబరు, 2024లో ఎఫ్ఎస్ఎస్ఐతో కుదిరిన ఒప్పందాన్ని అనుసరించండి..!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు అనుసరించి తిరుమలలో ల్యాబ్ ఏర్పాటుపై సత్యకుమార్ తనకున్న పరిచయాలతో కేంద్రంతో ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరిపారు. ఈ మేరకు ఫుడ్సేఫీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.23 కోట్లను సమర్పించింది. ఈ మేరకు రాష్ట్ర, ఆరోగ్య శాఖ, ఎఫ్ఎస్ఎస్ఏఐ మధ్య ఒప్పందం అక్టోబర్ 8, 2024న మంత్రి సత్యకుమార్ సమక్షంలో ఢిల్లీలో జరిగింది. అధికారులు తిరుమలలోని పిండిమిల్లు ఆవరణలో ఉన్న 12,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన పాత రెండు అంతస్తుల భవనాన్ని కేటాయించారు. దీనిని ఫుడ్ యాబరేటరిగా తీర్చిదిద్దే పనులు కిందటేడాది జులైలో ప్రారంభమయ్యాయి.
50 పరికరాలు/యంత్రాలతో విరివిగా నాణ్యమైన పరీక్షలు
ఈ ల్యాబ్లో మైక్రో బయాలజీ, కెమిస్ట్రీ, సెన్సరీ విభాగాల్లో నమూనాల పరీక్షలు జరగనున్నాయి ప్రసాదాలు, ఆహార పదారాలు, నీరు, ముడిసరకుల నాణ్యతను పరీక్షిస్తారు. ప్రసాదాలు, వాటికి వినియోగించే ముడిసరకుల్లో పురుగు మందుల అవశేషాలు, భారతలోహాలు, క్రిమీకీటకాలు, యాంటీబయాటిక్స్ వంటి వాటి నమూనాలను ఈ ల్యాబ్లో పరీక్షిస్తారు. ఆహార పదార్థాలు, ప్రసాదాల్లో 200 రకాల పురుగు మందుల అవశేషాలు గుర్తించే సామర్థ్యం కలిగిన యంత్రాలు ఈ ల్యాబ్ ద్వారా అందుబాటులోకి వస్తున్నాయి.
ఈ ల్యాబ్లో టీటీడీ జలప్రసాదాల నమూనాలను కూడా పరీక్షిస్తారు. వీటి అన్నింటి కోసం మొత్తం 50 రకాల పరికరాలు/ యంత్రాలు ఈ ఫుడ్ ల్యాబ్రేటరీలో ఉంటాయి. ఈ ల్యాబ్ నిర్వహణ కోసం వివిధ హోదాల్లో కలిపి 40 మంది ఉద్యోగులకు వైద్య ఆరోగ్య శాఖ, టీటీడీ సంయుక్తంగా అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ ల్యా శాఖ కార్యకలాపాలపై మరో ఒప్పంద వైద్య ఆరోగ్య, టీటీడీ మధ్య త్వరలో జరగనుంది. తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లో ల్యాబ్ల ఏర్పాటుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ వివిధ రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే ఏపీలో తొలిసారిగా ఓ పుణ్యక్షేత్రంలో ల్యాబ్ అత్యాధునిక వసతులతో రాబోతుంది.
ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్ అండ్ ఈ-నోస్ యంత్రాలు!
ఫ్రాన్స్లో తయారయ్యే ఈ యంత్రాన్ని తిరుమలలోని ఫుడ్ ల్యాబ్స్టరీలోనూ సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఇవి అందుబాటులో ఉన్న ల్యాబరేటరీలు దేశ వ్యాప్తంగా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. మనిషి ముక్కు ద్వారా వాసన, నోటి ద్వారా రుచి ఎలా చూస్తారో ఈ యంత్రాల ద్వారా ప్రసాదాలు, ఆహార పదార్థాలు, వాటి తయారీకి వినియోగించే ముడిసరకులను పరీక్షించేందుకు వీలుంది. తిరుమలలో కల్తీ నెయ్యి ఘటనను దృష్టిలో ఉంచుకుని మంత్రి సత్యకుమార్ చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ మిషన్ కొనుగోలుకు అవసరమైన రూ.3.5 కోట్లను అదనంగా ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ-టంగ్, ఈ-నోస్ యంత్రాల వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్లు కూడా ప్రాన్స్ నుండి వస్తాయి.
