

సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్ను జూన్ 30 వరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ కేసు పూర్తవడం లేదా పదవీ విరమణలో ఏది ముందైతే అప్పటివరకు కొనసాగనున్న సస్పెన్షన్ కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు వేధించారనే ఆరోపణలతో ఆయన కేసు నమోదైన విషయం తెలిసిందే.
అలాగే అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లాలనే అభియోగాలు. ఆల్ ఇండియా సర్వీసెస్ (డిసిప్లిన్ & అప్పీల్) రూల్స్, 1969లోని రూల్ 3(3) ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన క్రైమ్ నం.187/2024 దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ కేసు ఆయన సర్వీస్ హోదాతో సంబంధం కలిగి ఉండటంతో సస్పెన్షన్ను పొడిగించినట్లు ప్రభుత్వం గుర్తించింది.
