
డిసెంబర్ 28, 2025 11:38AMన పోస్ట్ చేయబడింది

భూతల స్వర్గం అరకు.. అల్లూరి జిల్లా పర్యాటకులతో నిండిపోయింది. వరుస సెలవులతో తెలుగు రాష్ట్రాలకు భారీగా పర్యాటకులు రావడంతో నిన్న రాత్రి నుంచి అక్కడి మేర ట్రాఫిక్కు చేరుకుంది. హోటల్ గదులు ఫుల్ అయ్యాయి. ఆదివారం కావడంతో అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి ప్రాంతాలకు టూరిస్టుల తాకిడితో ఉడెన్ బ్రిడ్జి వద్ద రద్దీ పెరిగింది.
చల్లని వాతావరణాన్ని ఆహ్లాదించడానికి… టూరిస్టులు వస్తున్నారు. దట్టమైన పొగమంచు అందాలను కెమెరాలను బంధిస్తున్నారు. విశాఖ, అరకు, పాడేరుల్లో హోటల్స్కి తెగ డిమాండ్ పెరిగింది.బొర్రా గుహలు, జలపాతాలు, అరకు లోయ, మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, చాపరాయి గెడ్డ, పాడేరు కాఫీ తోటలు, వంజంగి హిల్స్, కొత్తపల్లి జలపాతం, లంబసింగి ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంది.
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకుల రద్దీ పెరిగింది. ముఖ్యంగా మాడగడ, వంజంగి మేఘాల కొండ వ్యూ పాయింట్లకు పలు రాష్ట్రాల నుంచి పర్యాటకులు పోటెత్తిరావడంతో. శనివారం రోడ్లపై మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈరోజు కూడా భారీగా పర్యటకులు సందర్శించే అవకాశం ఉంది. ఇవాళ, రేపు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
