
డిసెంబర్ 27, 2025 6:11PMన పోస్ట్ చేయబడింది

జనవరి 5 నుంచి దేశ వ్యాప్తంగా మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం బచావో ఉద్యమం ప్రారంభించాలని CWC సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో ఐఐసీసీ అధ్యక్షుడు అల్లికార్జున ఖర్గే సారథ్యంలో జరిగిన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశం ఈ మేరకు తీర్మానించిందని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా ప్రకటించారు.
పేదవాడి ఆకలి తీర్చి, ప్రతి పౌరుడి ఉపాధికి హామీ ఇచ్చి, పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన చేకూర్చే బహుళ ప్రయోజనాలతో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథక”న్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. మహాత్ముడి పేరుతో ఉపాధి హామీని కాపాడుకోవాలని CWC తీర్మానించింది. దీని కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
