Home Latest News గ్యాస్ సమస్యను పెంచే స్నాక్స్.. సాయంత్రం 6గంటల తర్వాత వీటిని అస్సలు తినకూడదు..! | గ్యాస్ మరియు ఉబ్బరం నిరోధించే ఆహారాలు|వాయువు మరియు ఉబ్బరాన్ని బహిష్కరించడానికి ఏమి తినాలి| గ్యాస్ట్రిక్ సమస్యల లక్షణాలు| ఉబ్బరం మరియు గ్యాస్‌ను తక్షణమే తగ్గించే ఆహారాలు – ACPS NEWS

గ్యాస్ సమస్యను పెంచే స్నాక్స్.. సాయంత్రం 6గంటల తర్వాత వీటిని అస్సలు తినకూడదు..! | గ్యాస్ మరియు ఉబ్బరం నిరోధించే ఆహారాలు|వాయువు మరియు ఉబ్బరాన్ని బహిష్కరించడానికి ఏమి తినాలి| గ్యాస్ట్రిక్ సమస్యల లక్షణాలు| ఉబ్బరం మరియు గ్యాస్‌ను తక్షణమే తగ్గించే ఆహారాలు – ACPS NEWS

by Admin_swen
0 comments
గ్యాస్ సమస్యను పెంచే స్నాక్స్.. సాయంత్రం 6గంటల తర్వాత వీటిని అస్సలు తినకూడదు..! | గ్యాస్ మరియు ఉబ్బరం నిరోధించే ఆహారాలు|వాయువు మరియు ఉబ్బరాన్ని బహిష్కరించడానికి ఏమి తినాలి| గ్యాస్ట్రిక్ సమస్యల లక్షణాలు| ఉబ్బరం మరియు గ్యాస్‌ను తక్షణమే తగ్గించే ఆహారాలు

డిసెంబర్ 26, 2025 12:10PMన పోస్ట్ చేయబడింది


సాయంత్రం పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా అంటేనే స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది. అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. ఇంట్లో కుదరక పోతే కనీసం బయట అయినా స్నాక్స్ లాగించేవారు ఉంటారు. అయితే కొన్ని రకాల స్నాక్స్ ను సాయంత్రం 6గంటల తర్వాత అస్సలు తినకూడదని అంటున్నారు ఆహార నిపుణులు. దీని వల్ల గ్యాస్ సమస్య ఎక్కువ అవుతుందని, రాత్రంతా గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండాల్సిందేనని అంటున్నారు. ఇంతకీ సాయంత్రం 6 గంటల తర్వాత తినకూడని స్నాక్స్ ఏంటో తెలుసుకుంటే..

సాయంత్రం 6 గంటల తర్వాత కొన్ని స్నాక్స్ తినకూడదని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌లు చెబుతున్నారు. సమోసాలు, జిలేబీలు, పానీపురి, వడ పావ్, కచోరీలు, వేయించిన మోమోలు, నామ్కీన్‌లను సాయంత్రం 6 గంటల తర్వాత తినకూడదట. ఎక్కువ బటర్ తో కూడిన బర్గర్‌లు, పావ్ భాజీలు కూడా సాయంత్రం 6 తరువాత తినకూడదని అంటున్నారు.

పైన చెప్పుకున్న ఆహారాలను అప్పుడప్పుడు తినడం వల్ల ఏమీ కాదని అనుకుంటారు. కానీ అప్పుడ్పుడు తినడం అనేది అలవాటు అయితే చాలా కష్టమట. ఈ అలవాటు శరీరానికి ఎక్కువ, కొవ్వు, చక్కెరను ఇస్తాయి. ఇది గ్యాస్, ఎసిడి పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలకు బరువు పెరగడం. వేయించిన ఆహారాలు, టైప్ 2 డయాబెటిస్ మధ్య సంబంధం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. వేయించిన ఆహారాలు తినేవారిలో రక్తంలో చక్కెర నియంత్రణ తక్కువగా ఉంటుంది. ఇన్సులిన్ కూడా పెరిగే ప్రమాదం ఉంది.

వేయించిన ఆహారాలు పేగు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మంచి చూపును తగ్గిస్తాయి, వాపును పెంచుతాయి. ఆకలిని, షుగర్ క్రేవింగ్స్ ను నియంత్రించే హార్మోన్లు కూడా తగ్గుతాయి. దీని వల్ల వీటిని పదేపదే తినాలని అనిపిస్తుంది. ఇది బరువు పెరగడానికి కూడా కారణం అవుతుందట. కాబట్టి పైన ఆహారాలను అప్పుడప్పుడు తినడం కూడా కాస్త ఇబ్బందే. అలాగే కొన్ని ఆహారాలను 6 గంటల తర్వాత అస్సలు తినకూడదు.

*రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించబడ్డాయి. వారి ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు…

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird