Home Latest News కాలుకు కాలు, కీలుకు కీలు తీస్తా… పవన్ సంచలన వ్యాఖ్యలు | అమర జీవి జలధార ప్రాజెక్ట్| తూర్పుగోదావరి జిల్లా| పెరవలి| జలధర| డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్| యూపీ సీఎం యోగి| వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్| PM MODI| అమిత్ షా| పొట్టి శ్రీరాములు| బూర్గుల రామకృష్ణారావు| జనసేన| ఏపీ డిప్యూటీ సీఎం| కుల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ – ACPS NEWS

కాలుకు కాలు, కీలుకు కీలు తీస్తా… పవన్ సంచలన వ్యాఖ్యలు | అమర జీవి జలధార ప్రాజెక్ట్| తూర్పుగోదావరి జిల్లా| పెరవలి| జలధర| డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్| యూపీ సీఎం యోగి| వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్| PM MODI| అమిత్ షా| పొట్టి శ్రీరాములు| బూర్గుల రామకృష్ణారావు| జనసేన| ఏపీ డిప్యూటీ సీఎం| కుల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ – ACPS NEWS

by Admin_swen
0 comments
కాలుకు కాలు, కీలుకు కీలు తీస్తా... పవన్ సంచలన వ్యాఖ్యలు | అమర జీవి జలధార ప్రాజెక్ట్| తూర్పుగోదావరి జిల్లా| పెరవలి| జలధర| డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్| యూపీ సీఎం యోగి| వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్| PM MODI| అమిత్ షా| పొట్టి శ్రీరాములు| బూర్గుల రామకృష్ణారావు| జనసేన| ఏపీ డిప్యూటీ సీఎం| కుల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్

డిసెంబర్ 20, 2025 4:02PMన పోస్ట్ చేయబడింది


తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో జరిగిన అమరజీవి జలధార శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో సీట్లు అమ్ముకున్నారని నన్ను గుర్తుపట్టారు. ప్రజల తాను సీట్లు తగ్గించుకున్నా అధికారమున్నా లేకున్నా నేను నాలాగే ఉంటా..బెదిరించే నాయకులకు భయపడను. యూపీ సీఎం యోగి తరహాలో ట్రీట్‌మెంట్ ఇస్తే అందరూ సెట్ అవుతారు. కాలుకు కాలు, కీలు తీస్తే ఆకు రౌడీలు దారికొస్తారు అని పవన్ అన్నారు.

అమరజీవి జలధార ద్వారా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదుల మేరకు 7,910 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.21 కోట్ల మంది దాహర్తి తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకారుల సోదరులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ శాతం తీర ప్రాంతాలను కలిపేల ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. 2027 నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాములుని సదా స్మరించుకోవాలనే ఉద్దేశంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు “అమరజీవి జలధార”గా నామకరణం చేశామని పవన్ తెలిపారు.

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. స్వచ్ఛమైన తాగు నీరు కావాలంటే డబ్బు పోసి కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. మళ్లీ మేము అధికారంలోకి వస్తాం.. మీ అంతు చూస్తాం అని కొందరు వైసీపీ నాయకులు బహిరంగంగా బెదిరింపులకు దిగేందుకు డిప్యూటీ సీఎం ప్రకటించారు. పనులు చేస్తే కాంట్రాక్టర్లను జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు. వారందరికీ ఒకటే చెబుతున్నాం… మీకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే కరెక్ట్. ప్రభుత్వం తలుచుకుంటే బలమైన నక్సలిజమే కకావికలం అయిపోయిందని పవన్ చెప్పారు. ఇలా బెదిరింపులకు దిగే కిరాయి రౌడీలకు ప్రభుత్వం బలమైన పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఏంటో ఆలోచించాలని కోరుకుంటున్నాను.

కొంతమంది నాయకులు ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారంటే పిఠాపురంలో పిల్లల మధ్య సామాజిక వర్గాల పేరుతో చిచ్చు పెట్టారు. అన్నం తినేవాడు ఎవడైనా ఇలా చేస్తాడా? రాజకీయం చేయడానికి వేరే దారులే లేవా? ఇలాంటి పనులు చేసే వారికి సిగ్గుండాలని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న పెద్దలతో చర్చించామని జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు గడువు పొడిగించేందుకు ఒప్పించామని ఈ రోజు రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు తీసుకువస్తున్నామంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన సంపూర్ణ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లగలుగుతున్నామని చెప్పారు.

You Might Also Like

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird