
డిసెంబర్ 17, 2025 7:04PMన పోస్ట్ చేయబడింది
.webp)
జీహెచ్డీ డీలిమిటేషన్పై అభ్యంతరాల గడువు మరో రెండు రోజులు (డిసెంబర్ 19 వరకు) పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫీకేషన్పై దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. వార్డుల వారీగా జనాభా సంఖ్యతో పాటు మ్యాప్లను 24 గంటల్లో పబ్లిక్ డొమైన్లో ఉంచాలని జీహెచ్హెచ్ఎల్కి కోర్టు సూచించింది.
పిటిషనర్ పునర్విభజనపై సమాచారం అందించలేదని జనాభ, సరిహద్దులను పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.సెన్సస్ కమిషనర్ ఇచ్చిన డిసెంబర్ 31 డెడ్లైన్ గురించి అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించాయి. గ్రేటర్ పరిధిని విస్తరించి 150 నుంచి 300 వార్డులకు పెంచుతూ డిసెంబర్ 9న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయింది.దీనిపై వెల్లువలా అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
