
డిసెంబర్ 10, 2025 8:47AMన పోస్ట్ చేయబడింది

భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో భాగస్వామి అయినందుకు ఆనందంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. వచ్చే పాతికేళ్లలో తెలంగాణను దేశంలోనే అభివృద్ది చెందిన రాష్ట్రం గా తెలంగాణ అన్న లక్ష్యంతో కృషి చేయాలన్న ఆశయం మహోత్కృష్టమైనదన్నారు. గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా మంగళవారం (డిసెంబర్ 9) విజన్ డాక్యుమెంట్ కార్యక్రమంలో ప్రసంగించిన దువ్వూరి సుబ్బారావు.. తను అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కార్యదర్శిగా, ఖమ్మం కలెక్టర్ గా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తాను హైదరాబాద్ వాడిననీ, తనది తెలంగాణ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని చెప్పారు.
తెలంగాణ అన్ స్టాపబుల్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, తాను తెలంగాణ అన్ బీటబుల్ అంటున్నానని చెప్పారు. చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ మోడల్ ఆధారంగా తెలంగాణ ముందుకు సాగడం గొప్ప విషయమన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లు ఎకానమీని సాధించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సాధించడానికి, ఏటా 8 నుంచి 9 శాతం వృద్ధి సాధించాలన్న దువ్వూరి సుబ్బారావు, ఇది నిజంగా ఒక చాలెంజ్, కొంచం కష్టమే అయినా ఇంతటి లక్ష్యం పెట్టుకున్న సీఎం రేవంత్ ను అభినందిస్తున్నాను. హైదరాబాద్ ను అద్భుత నగరంగా అభివర్ణించిన దువ్వూరి సుబ్బారావు, ఒకప్పుడు తెలంగాణ పేదరికంతో వెనుకబడి ఉండేది కానీ, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి దిశలో పయనిస్తోందన్నారు. రెండు దశాబ్దాల కింద ప్రజలందరూ బెంగళూరుకు వెళ్లేవారు, అప్పుడు అందరూ హైదరాబాద్ను తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకుని ఇక్కడ స్థిరపడేందుకు ఇష్టపడుతున్నారనీ, దీన్ని బట్టి తెలంగాణ గొప్పతనం ఏంటో అర్థం చేసుకోడానికి దువ్వూరి అన్నారు.
తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ను ఐఎస్ బీ, నీతి ఆయోగ్ సంస్థలకు చెందిన మేధావులతో రూపొందించడం అభినందనీయమన్న ఆయన సలహా మండలి సభ్యుడిగా ఈ డాక్యుమెంట్ అమ లుకు తనవంతు కృషి చేస్తానన్నారు. హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా, లైఫ్సెస్, జీసీసీల్లో అభివృద్ధి సాధించిందనీ, ఇప్పుడిప్పుడే తయారీ రంగం, వ్యవసాయ రంగం, ఇతర ఉపాధి రంగాలు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఇన్ విద్య ఫ్రాస్ట్రక్షర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూచించింది.
