
డిసెంబర్ 9, 2025 8:41AMన పోస్ట్ చేయబడింది
.webp)
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పైరసీ కేసులో ప్రధాన నిందితుడైన ఐబొమ్మ రవి కస్టడీ వ్యవహారంలో సైబర్ క్రైమ్ పోలీసులు రివిజన్ పిటిషన్ వేశారు. ఐబొమ్మ రవికువిచారణకు కోర్టు కేటాయించిన మూడు రోజుల సమయం సరిపోదని, ఆయన కస్టడీని పొడిగించాలనీ ఆ రివిజన్ పిటిషన్లో పేర్కొన్నారు.
ఐబొమ్మ రవిపై నమోదైన మూడు కేసులకు సంబంధించి ఒక్కో కేసుకు ఒక్కో రోజు చొప్పున కోర్టు మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించినట్లు తెలుస్తోంది. మొత్తం నాలుగు కేసుల్లోనూ సమగ్రంగా విచారించాల్సి ఉందని, ఇందుకు గాను ఐదు రోజుల కస్టడీ అవసరమని పోలీసులు తమ రివిజన్ పిటిషన్లో పేర్కొన్నారు. ‘కుబేర’, ‘కిష్కింద పురి’, ‘తాండేల్’, ‘హిట్’ వంటి చిత్రాల పైరసీకి సంబంధించి కీలకమైన రవి నుంచి రాబట్టాల్సి ఉందని వివరించారు. ఇందు కోసం అదనపు కస్టడీ అవసరమని పేర్కొన్నారు.
పైరసీ చేసిన సోర్స్లు ఫై, రవి అందుకున్న టెక్నికల్ సహాయం, సర్వర్లు, విదేశీ ఐపీ అడ్రెసులు, ఆర్థిక లావాదేవీలు వంటి వాటి వివరాలను సేకరించాల్సి ఉందన్న సైబర్ క్రైమ్ పోలీసులు, రవి నిర్వహింపజేసిన నెట్వర్క్లో ఎంత మంది భాగస్వా ములు ఉన్నారు? సినిమాల డిజిటల్ కాపీలు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఎలాంటి ఛానళ్ల ద్వారా పంపిణీ చేశారు? అనే విషయాలపై ప్రశ్నించాల్సి ఉంది. కాగా పోలీసుల రివిజన్ పిటిషన్ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
