Home Latest News పంచాయతీ ఎన్నికలు.. అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్! | పంచాయితీ అభ్యర్థుల్లో టెన్షన్| 1వ| దశ| ప్రచారం| ముగుస్తుంది – ACPS NEWS

పంచాయతీ ఎన్నికలు.. అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్! | పంచాయితీ అభ్యర్థుల్లో టెన్షన్| 1వ| దశ| ప్రచారం| ముగుస్తుంది – ACPS NEWS

by Admin_swen
0 comments
పంచాయతీ ఎన్నికలు.. అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్! | పంచాయితీ అభ్యర్థుల్లో టెన్షన్| 1వ| దశ| ప్రచారం| ముగుస్తుంది

డిసెంబర్ 9, 2025 11:01AMన పోస్ట్ చేయబడింది


పంచాయతీ ఎన్నికలలో తొలి విడత ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడడంతో అభ్యర్థుల్లో టెన్షన్ ప్రారంభమైంది. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. ప్రచారానికి వారం రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో గ్రామాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. వారికి కేటాయించిన గుర్తులతో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సారి గ్రాయపంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి.

ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీనితో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం (డిసెంబర్ 9) సాయంత్రంతో ముగియనుంది. అడలా ఉండగా.. రెండో విడత ఎన్నికలకు సంబంధించిన ప్రచారం మరింత జోరందుకుంది. ఈ నెల 14న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. మరో పక్క మూడో విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయింది. దీనికి సంబంధించి ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. అంతే కాకుండా ఈ నెల 17న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird