
డిసెంబర్ 9, 2025 9:12AMన పోస్ట్ చేయబడింది
.webp)
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానశ్రయానికి మరో సారి బాంబు బెదరింపు కాల్ వచ్చింది. న్యూయార్క్కు చెందిన జాస్పర్ పకార్ట్ అనే వ్యక్తి పేరుతో ఈ మెయిల్తో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు సెక్యూరిటీని అలర్ట్ చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు జరిగాయి.
శంషాబాద్ నుంచి అమెరికాకు విమానాల్లో బాంబులు పెట్టాననీ, టేకాఫ్ అయిన పది నిమిషాల్లో పేలుస్తానని ఆ ఈమెయిల్లో జాస్పర్ పకార్ట్ వెళ్లాడు. అంతే కాకుండా, బాంబులు పేలకుండా ఉండాలంటే ఒక మిలియన్ డాలర్లు అందించండి డిమాండ్ చేసినట్టు.
బెదిరింపు మెయిల్ అందిన వెంటనే అధికారులు అప్రమత్తమై వెంటనే ఎయిర్పోర్ట్లో హై అలర్ట్ ప్రకటన. సీఐఎస్ఎఫ్, బాంబ్ స్క్వాడ్, డాగ్స్క్వాడ్లు సంఘటన స్థలానికి చేరుకుని ఎయిర్పోర్ట్ లోపలి, బయటి ప్రాంతాలు, పార్కింగ్, కార్గో, రన్వే పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అమెరికా బౌండ్ విమానాలకు అదనపు భద్రతా చర్యలు అమలులో ఉన్నాయి.ఈ మెయిల్ మూలం, పంపిన వ్యక్తి వివరాలపై సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒకవైపు వరుసగా బాంబు బెదిరింపు ఈమెయిల్స్, మరోవైపు విమానాల రద్దుతో శంషాబాద్ విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితి.
