
డిసెంబర్ 4, 2025 11:59AMన పోస్ట్ చేయబడింది

మావోయిస్టు కీలక నేత హిడ్మా ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. హిడ్మాది ఎన్ కౌంటర్ కాదనీ, అది ముమ్మాటికీ పోలీసులు చేసిన హత్యే ఈ మేరకు సంచలన ఆరోపణ చేసింది. అనారోగ్యంతో చికిత్స కోసం నవంబర్ 15న విజయవాడలో హిడ్మాను అదే రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. మూడు రోజుల తరువాత అంటే నవంబర్ 18న అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి వద్దకు వెళ్లి హత్య చేసినట్లు ఆ లేఖలో మావోయిస్టు పార్టీ ఆరోపించింది.
హిడ్మా కదలికలను లొంగిపోయిన మావోయిస్టు కుసాల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడని కమిటీ ఆరోపించింది. ఈ కుట్రలో విజయవాడకు చెందిన కొందరు వ్యాపారులు, కాంట్రాక్టర్ల పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు. హిడ్మా హత్యకు మావోయిస్టు అగ్రనేత దేవ్జీ కారణమంటూ వస్తున్న ఆరోపణలను మావోయిస్టు పార్టీ దండకారణ్య జోనల్ కమిటీ ఖండించింది. మావోయిస్టు పార్టీపై జరుగుతున్న కుట్రలో భాగమే ఆ ఆరోపణలు అని తెలుస్తోంది. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, హడ్మా హత్య సహా ఎన్ కౌంటర్ లపై న్యాయ విచారణ జరిపించాలని మావోయిస్టు పార్టీ ఆ లేఖలో డిమాండ్ చేసింది.
