
డిసెంబర్ 3, 2025 3:21PMన పోస్ట్ చేయబడింది

పల్లెలో గ్రామ పంచాయితీ ఎన్నికల రగడ మొదలైంది. గ్రామంలో ఉన్న కోతులను తరిమిన తర్వాతే ఓట్లు అడగాలని ఓటర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. కోతులు లేకుండా అభ్యర్థులకు ఓట్లు వేస్తామని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కోతుల బెడదను తీర్చేవారినే సర్పంచ్గా గెలిపిస్తామంటూ ఓటర్లు ఖరాఖండిగా చెబుతున్నారు. తెలంగాణలో దాదాపు 35 లక్షలకు పైగా కోతులు ఉన్నాయంట. చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా కోతులు దాడులు చేస్తున్నాయి. కోతుల దాడిలో గాయపడటంతో పాటు గుంపుగా దాడి చేయడంతో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి.