Home Latest News పొగాకు, పాన్ మసాలా ఉత్పత్తులకు కేంద్రం షాక్ | నిర్మలా సీతారామన్| గుట్కా| పాన్ మసాలా| జాతీయ భద్రతా సెస్ బిల్లు 2025 పొగాకు పరిశ్రమ| పన్ను| GST పరిహారం సెస్| సెంట్రల్ ఎక్సైజ్ చట్టం| భారతదేశం| ఆర్థిక మంత్రిత్వ శాఖ| శీతాకాల పార్లమెంట్ సమావేశాలు – ACPS NEWS

పొగాకు, పాన్ మసాలా ఉత్పత్తులకు కేంద్రం షాక్ | నిర్మలా సీతారామన్| గుట్కా| పాన్ మసాలా| జాతీయ భద్రతా సెస్ బిల్లు 2025 పొగాకు పరిశ్రమ| పన్ను| GST పరిహారం సెస్| సెంట్రల్ ఎక్సైజ్ చట్టం| భారతదేశం| ఆర్థిక మంత్రిత్వ శాఖ| శీతాకాల పార్లమెంట్ సమావేశాలు – ACPS NEWS

by Admin_swen
0 comments
పొగాకు, పాన్ మసాలా ఉత్పత్తులకు కేంద్రం షాక్ | నిర్మలా సీతారామన్| గుట్కా| పాన్ మసాలా| జాతీయ భద్రతా సెస్ బిల్లు 2025 పొగాకు పరిశ్రమ| పన్ను| GST పరిహారం సెస్| సెంట్రల్ ఎక్సైజ్ చట్టం| భారతదేశం| ఆర్థిక మంత్రిత్వ శాఖ| శీతాకాల పార్లమెంట్ సమావేశాలు

డిసెంబర్ 1, 2025 8:41PMన పోస్ట్ చేయబడింది


పెద్దగా నియంత్రణ లేని గుట్కా, పాన్ మసాలా పరిశ్రమను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలో కీలక చట్టాన్ని తీసుకురాబోతోంది. ‘హెల్త్ సెక్యూరిటీ టు నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్, 2025’ పేరుతో రూపొందించిన ఈ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.

ఈ కొత్త చట్టం ప్రకారం, గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు వస్తువులపై పన్ను విధించే విధానం పూర్తిగా మారనుంది. ఇప్పటివరకు తుది ఉత్పత్తి ఆధారంగా విధిగా, ఇకపై వాటి తయారీకి ఉపయోగించే యంత్రాల ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా ప్రత్యేక సెస్సు విధించబడుతుంది. చేతితో తయారుచేసే యూనిట్లకు కూడా ప్రతినెలా నిర్దిష్ట మొత్తంలో సెస్సు చెల్లించాల్సి ఉంటుంది.

నిబంధనలు కఠినతరం

ఈ కొత్త విధానంలో, ఉత్పత్తి ఎంత జరిగిందంటే దానితో సంబంధం లేకుండా ప్రతి నెల తయారీదారులు సెస్సు చెల్లించాలి. ఒకవేళ యంత్రాలు లేదా యూనిట్ 15 రోజులకు మించి పనిచేయకపోతే మాత్రమే మినహాయింపు. ప్రతి తయారీదారు తప్పనిసరిగా ప్రభుత్వంతో రిజిస్టర్ చేసుకోవాలి, నెలవారీ రిటర్న్స్ దాఖలు చేయాలి. అధికారులు ఎప్పుడైనా తనిఖీలు, ఆడిట్ కోసం విచారణ కల్పించాలి. ఈ నిబంధనల ఉల్లంఘనకు ఐళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించేలా బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి. అవసరమైతే సెస్సును రెట్టింపు చేసే అధికారాన్ని కూడా ప్రభుత్వం తన వద్దే ఉంచుకోనుంది.

ధరలపై ప్రభావం ఉండదు

మరోవైపు, సిగరెట్లపై ఉన్న జీఎస్టీ పరిహార సెస్సును కూడా ఎక్సైజ్ చట్టం పరిధిలోకి మారుస్తూ మరో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. అయితే, ఈ మార్పుల వల్ల గుట్కా, పాన్ మసాలా లేదా సిగరెట్ల ధరలపై ఎలాంటి అదనపు భారం పడుతుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పన్ను రేట్లలో ఎటువంటి మార్పు ఉండదని, కేవలం పన్నుల వసూలు విధానాన్ని క్రమబద్ధీకరించడం, పారదర్శకత పెంచడమే లక్ష్యమని వివరించబడింది

You Might Also Like

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird