Home Latest News పెన్షన్ల కోసమే రూ.50 వేల కోట్లు ఖర్చు చేశాం : సీఎం చంద్రబాబు | సీఎం చంద్రబాబు| ఆంధ్ర ప్రదేశ్| ఉంగుటూరు| పెన్షన్ పథకం| ఎన్టీఆర్ భరోసా| సూపర్ సిక్స్| AP ఎన్నికలు 2024| రైతు సంక్షేమం| మహిళా సంక్షేమం| చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్| నారాలోకేష్ – ACPS NEWS

పెన్షన్ల కోసమే రూ.50 వేల కోట్లు ఖర్చు చేశాం : సీఎం చంద్రబాబు | సీఎం చంద్రబాబు| ఆంధ్ర ప్రదేశ్| ఉంగుటూరు| పెన్షన్ పథకం| ఎన్టీఆర్ భరోసా| సూపర్ సిక్స్| AP ఎన్నికలు 2024| రైతు సంక్షేమం| మహిళా సంక్షేమం| చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్| నారాలోకేష్ – ACPS NEWS

by Admin_swen
0 comments
పెన్షన్ల కోసమే రూ.50 వేల కోట్లు ఖర్చు చేశాం : సీఎం చంద్రబాబు | సీఎం చంద్రబాబు| ఆంధ్ర ప్రదేశ్| ఉంగుటూరు| పెన్షన్ పథకం| ఎన్టీఆర్ భరోసా| సూపర్ సిక్స్| AP ఎన్నికలు 2024| రైతు సంక్షేమం| మహిళా సంక్షేమం| చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్| నారాలోకేష్

డిసెంబర్ 1, 2025 3:42PMన పోస్ట్ చేయబడింది


ప్రభుత్వం 18 నెలల కూటమిలో పెన్షన్ల కోసమే రూ.50 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ ఏలూరు జిల్లా ఉంగుటూరు మండల పరిధిలోని గోపీనాథపట్నంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గుడ్ల నాగలక్ష్మికి పెన్షన్ అందించారు. అనంతరం ఉంగుటూరులో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ ఎగ్జిబిషన్‌ను సందర్శించి, ప్రజా వేదిక సభలో సీఎం నిర్వహించారు.

ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతు విధ్వంసమైన పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామని చెప్పారు. గ్రామసభలు అంటే మొక్కుబడిగా నిర్వహించడం కాదని ఒక మార్పు రావాలని అన్నారు. అభివృద్ధి పనుల వివరాలన్నీ సచివాలయంలో ఉంచాలని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరువేరుతున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కంటే ధనిక రాష్ట్రాలు కూడా పెన్షన్ల కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం లేదని ముఖ్యమంత్రి అన్నారు.

రాబోయే ఐదేళ్లలో రూ.1.65 లక్షల కోట్ల పెన్షన్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ప్రతి వంద మందిలో 13 మందికి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. రాబోయే ఐదేళ్లలో రూ.1.65 లక్షల కోట్ల పెన్షన్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ప్రతి వంద మందిలో 13 మందికి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. ప్రజల ఆహార అలపువాట్లకు అనుగుణంగా రైతులు డిమాండ్ ఆధారిత పంటలు పండించాలన్నారు. ఏపీ అభివృద్ధి జరిగితేనే భూముల ధరలు పెరుగుతాయని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కాబట్టే అక్కడి భూముల ధరలు పెరిగాయని.

ఒకప్పుడు కోకాపేటలో రూ.10 వేలకు ఎకరం భూమి వచ్చేదని, ఇప్పుడు ఏకంగా రూ.170 కోట్లకు పైనే పలుకుతోందని అన్నారు. ఏపీకి భవిష్యత్తులో మంచి రోజులు రాబోతున్నాయని చంద్రబాబు అన్నారు. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామని.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అమలు చేస్తున్నామని చెప్పారు.

ప్రజలు అభ్యర్థులను 164 కూటమిలో గెలిపించి తమకు అపూర్వ మద్దతును అందించారని ఇన్ని సీట్లు ఇవ్వడం ద్వారా ప్రజలు తమ బాధ్యతను మరింత పెంచారని సీఎం తెలిపారు. 16,347 మందికి డీఎస్సీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతుకు రూ.20 వేలు ఇచ్చిన గుర్తు చేశారు. పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.14 వేలు జమ చేశామని ఆయన అన్నారు. పంచసూత్రాల ఆధారంగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనేదే ప్రభుత్వం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird