
నవంబర్ 28, 2025 5:11PMన పోస్ట్ చేయబడింది
.webp)
దేశంలోని ప్రధాన నగరాల్లో వాయుకాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరడంపై లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం విషయంలో కేంద్రని మోడీ సర్కార్ బాధ్యత రహితంగా వ్యవహరిస్తోందని. నగరాలలో వాయుకాలుష్యంపై పార్లమెంటులో చర్చజరగాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చే నెల మొదటి తేదీ నుంచి ప్రారంభం కానున్న సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ వేదిరగా రాహుల్ గాంధీ ఈ డిమాండ్ చేశారు.
వాయుకాలుష్య సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రణాళిక లేదని దుయ్యబట్టారు. పిల్లలు వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ప్రధాని మోడీ మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు. పిల్లల భవిష్యత్, ఆరోగ్యం విషయంలో జవాబుదారీతనం ఉండాలన్న రాహుల్ గాంధీ వాయుకాలుష్యంపై పార్లమెంటులో చర్చించి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికాబద్ధమైన, ఆచరణాత్మకమైన అవసరమని చెప్పారు.
