
నవంబర్ 20, 2025 12:29PMన పోస్ట్ చేయబడింది

పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఎడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన ఈ కేసులో ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం వచ్చే నెల 2 లోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ యెడ్యూరప్పకు సమన్లు జారీ చేసింది. యెడ్యూరప్పపై 2004లో పోక్సో కేసు నమోదైంది. సహాయం కోరేందుకు 2024 ఫిబ్రవరి 2న తన నివాసానికి వచ్చిన ఓ మైనర్ బాలికను యెడ్యూరప్ప ఆసక్తిగా వేధించారని ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి. బాధితురాలి తల్లిపై ఫిర్యాదు అప్పట్లో సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది.
ఈ కేసు విచారణలో భాగంగా యెడ్యూరప్ప వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తూ న్యాయస్థానం ఆయనకు తాజాగా సమన్లు జారీ చేసింది. అంతకు ముందు తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ యెడ్యూరప్ప ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా, ఆయన అభ్యర్ధనను కోర్టు ధర్మాసనం కొట్టివేసి, విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల కోర్టు డ్యూరప్పను వ్యక్తిగతంగా జారీ చేయడం సంతరించుకుంది ప్రాథాన్యత.