Home Latest News జూబ్లీ బైపోల్.. సునీతకు మాగంటి అభిమానుల సహాయ నిరాకరణ? | సునీతకు సహకరించని మాగంటి అనుచరులు| జూబ్లీహిల్స్ – ACPS NEWS

జూబ్లీ బైపోల్.. సునీతకు మాగంటి అభిమానుల సహాయ నిరాకరణ? | సునీతకు సహకరించని మాగంటి అనుచరులు| జూబ్లీహిల్స్ – ACPS NEWS

by Admin_swen
0 comments
జూబ్లీ బైపోల్.. సునీతకు మాగంటి అభిమానుల సహాయ నిరాకరణ? | సునీతకు సహకరించని మాగంటి అనుచరులు| జూబ్లీహిల్స్

నవంబర్ 13, 2025 1:26PMన పోస్ట్ చేయబడింది


తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కాంగ్రెస్ అభ్యర్థికే అనుకూలంగా వచ్చాయి. జూబ్లీహిల్స్ ఓటర్లు అధికార పార్టీకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన అన్ని సంస్థలూ అంచనావేశాయి. మాగంటి మరణం తర్వాత అనివార్యంగా జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అందరికంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం మొదలుపెట్టింది. సిట్టింగ్ సీట్‌ను ఎలాగైనా దక్కించుకునేందుకు, తిరిగి మాగంటి కుటుంబానికే జూబ్లీహిల్స్ టికెట్ కన్ఫర్మ్ చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. సెంటిమెంటే తమ అస్త్రంగా మాగంటి సునీత, ఆమె కుటుంబ సభ్యులు ప్రచారం చేశారు. అయినా కూడా మాగంటి సునీతకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి. ఇక బీఆర్ఎస్ వర్గాలలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపినాథ్‌కు అనేకమంది అనుచరులు, అభిమానులు ఉన్నారు. అయితే ఆయన అకాల మరణం తర్వాత వచ్చిన ఈ ఉపఎన్నికలో మాత్రం గోపినాథ్ భార్య మాగంటి సునీతకు ఆయన అనుచరులు, అభిమానులు ఎవరూ గ్రౌండ్ లెవల్ లో సహకరించలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాగంటి ఎన్నికల్లో నిలబడుతున్నారంటే చాలు ఆయన అభిమానులే ఎన్నికల భారమంతా తమ భుజాల మీద మోస్తూ గోపీనాథ్ ను గెలుపించుకునేవారు. కానీ, ఈ ఉపఎన్నికలో వారంతా నామమాత్రంగానే పనిచేశారనీ, అందుకే సునీత వెనుకంజలో ఉన్నారని గులాబీ పార్టీలో నడుస్తోంది.

మాగంటి సునీత విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ ఎలాగైనా ఆమెను గెలుపించుకోవాలని శతవిధాల ప్రయత్నించింది. ప్రచార బాధ్యతను మొత్తం ఒంటిచేత్తో లాక్కొచ్చిన కేటీఆర్, కింది స్థాయి నాయకత్వాన్ని సమన్యయపరచడానికి సరైన కార్యచరణ చేయలేకపోయారని, మాగంటి గోపీనాథ్ అనుచరులను సునీత విజయం కోసం మోటివేట్ చేయడంలో విఫలమయ్యారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే సునీత విజయం కోసం తీవ్రంగా కష్టపడ్డ కేటీఆర్ నాయకుల్లో సమన్వయం తీసుకురావడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయారట.

మాగంటి గోపీనాథ్‌ది సహజ మరణం కాదంటూ.. గోపీనాథ్ అభిమానుల పేర్లతో జూబ్లీహిల్స్‌లో వెలిసిన పోస్టర్లు.. మాగంటి మొదటి భార్య, కొడుకుపై వచ్చిన ఆరోపణలు, గోపీనాథ్ తల్లి మహానంద కుమారి హైదరాబాద్‌లో ఏకంగా కేటీఆర్ పైనే ఆరోపణలు చేయడం.. ఇవన్నీ సునీత ఓటమికి కారణాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గోపీనాథ్ అభిమానులు, అనుచరులు ఈ ఉప ఎన్నికలో సునీత విజయం కోసం అంకిత భావంతో పని చేయకపోవడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగా మారిందని బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి. మరి చూడాలి ఈ ఉపఎన్నిక ఫలితం ఎలా ఉంటుందో.. మాగంటి సునీతకు ఎంతమేర ఓటు పర్సంటేజ్ నమోదవుతుందో?

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird