
నవంబర్ 10, 2025 8:24PMన పోస్ట్ చేయబడింది

ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్షాకు ఫోన్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పేలుడు ఘటనలో ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు సంస్థ అతడిని ప్రశ్నిస్తోంది. బాంబు పేలుడుపై ఢిల్లీ పోలీసు కమీషనర్ స్పందించారు. సీసీటీవీ ఫుటేజీలో కీలక అంశాలను కనుగొన్నట్లు. ఫుటేజీ ఆధారంగా.. నెమ్మదిగా వెళ్తున్న కారులో పేలుడు గుర్తించారు.
ఆ కారు కూడా వాహనాలు ఎక్కువగా ఉన్న చోటికి పేలుడు జరిగినట్లుగా గుర్తించామన్నారు. ఆ కారు కావాలంటే రద్దీగా ఉన్న చోటికి వెళ్లి ? లేక కారులో వేరే వ్యక్తుల బాంబును అమర్చారా? పేలుడు ఎలా జరిగింది? అన్న విషయాలపై సమగ్ర దర్యాప్తు నిర్ధారించింది. ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరగా.. క్షతగాత్రుల సంఖ్య 30కి చేరింది. ఎన్ఏఐ, ఎన్ఎస్జీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
