
నవంబర్ 9, 2025 11:13AMన పోస్ట్ చేయబడింది

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐదు రాష్ట్రాల్లో సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. సైబర్ మోసాల్లో 81 మందిని ఏపీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.
దర్యాప్తులో భాగంగా నిందితులపై 754 కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. మొత్తం రూ.95 కోట్ల విలువైన మోసాలు జరిపినట్లు తేలింది.
అరెస్టు చేసిన వారిలో 17 మంది ఏజెంట్లు, 7 మంది మహిళలు ఉన్నారు. అలాగే 58 మంది మ్యూల్ ఖాతాదారులు (మోసపూరిత డబ్బు బదిలీకి ఉపయోగించే వారు) పేర్కొన్నారు.
వారి వద్ద నుండి 84 మొబైల్ ఫోన్లు, 101 సిమ్ కార్డులు, 89 బ్యాంకు పాస్బుక్లు, చెక్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఖాతాల్లో ఉన్న కోట్ల రూపాయల నగదును ఫ్రీజ్ చేశారు. ఈ బాధితులకు తిరిగి అందించే చర్యలు సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపడుతోంది.
