Home Latest News ఒక్క ఛాన్స్ పేరుతో ఏపీ నష్టపోయింది… బీహార్ కి ఆ పరిస్థితి రావద్దు : లోకేష్ | బీహార్ ఎన్నికలు| మంత్రి నారా లోకేష్| NDA| నితీష్ కుమార్| PM MODI| వికాసిత్ భారత్| RJD| JDU| లాలూ ప్రసాద్ యాదవ్ – ACPS NEWS

ఒక్క ఛాన్స్ పేరుతో ఏపీ నష్టపోయింది… బీహార్ కి ఆ పరిస్థితి రావద్దు : లోకేష్ | బీహార్ ఎన్నికలు| మంత్రి నారా లోకేష్| NDA| నితీష్ కుమార్| PM MODI| వికాసిత్ భారత్| RJD| JDU| లాలూ ప్రసాద్ యాదవ్ – ACPS NEWS

by Admin_swen
0 comments
ఒక్క ఛాన్స్ పేరుతో ఏపీ నష్టపోయింది... బీహార్ కి ఆ పరిస్థితి రావద్దు : లోకేష్ | బీహార్ ఎన్నికలు| మంత్రి నారా లోకేష్| NDA| నితీష్ కుమార్| PM MODI| వికాసిత్ భారత్| RJD| JDU| లాలూ ప్రసాద్ యాదవ్

నవంబర్ 9, 2025 11:51AMన పోస్ట్ చేయబడింది


వికసిత్ భారత్ లక్ష్యసాధనలో బీహార్ పాత్ర చాలా కీలకమైంది. బీహార్ సర్వతో ముఖాభివృద్ధికి మరోమారు బీహార్ డీఏను గెలిపించాల్సిందిగా ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నా వెళ్లిన లోకేష్… అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… నేను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఇక్కడికి రాలేదు. బాధ్యతాయుతమైన భారతీయుడిగా ఇక్కడకు వచ్చాను. బీహార్ లో జరగబోయే ఈ ఎన్నిక భారత రాజకీయాల్లో ఎంతో కీలకమైనది.

బీహార్ మరో యువతమారు ఎన్ డీఏని ఎందుకు గెలిపించాలో చెప్పడానికే ఇక్కడకు వచ్చాను. మూడు కారణాలతో ఇక్కడ ప్రజలు ఎన్ డీఏని గెలిపించాలి. ఏపీలో 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో వైసీపీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల శాంతిభద్రతలు క్షీణించి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. దానివల్ల మా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఇలాంటి పరిస్థితులు బీహార్ లో తెచ్చుకోవద్దని యువతకు విజ్ఞప్తి చేస్తున్నా. బీహార్ అభివృద్ధి కోసం ఎన్ డీఏను మరోమారు గెలిపించాలి. బీహార్ లో మూడు కారణాల వల్ల ఎన్ డీఏ ని గెలిపించాల్సిన అవసరం ఉంది.

లీడర్ షిప్ రికార్డు – స్వచ్ఛమైన, అవినీతిరహిత పాలన కోసం ఎన్ డీఏని గెలిపించాలి.ప్రధాని మోదీ బీహార్ రూపరేఖలు మార్చేశారు. బీహార్ లో నాని నరేంద్ర మోడీ , నితీష్ కుమార్ నాయకత్వం ఉంది. ఏపీలో నరేంద్ర మోడీజీ, నాయుడు నాయకత్వం ఉంది. విజన్, సమర్థతతో వారు పాలన చేస్తున్నారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బీహార్ పాత్ర చాలా పెద్దది. బీహార్ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే ఆయన లక్ష్యం.

డబుల్ ఇంజన్ సర్కారు – బీహార్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ డీఏ భాగస్వామ్య ప్రభుత్వాలు ఉండటం వల్ల కేంద్రబడ్జెట్ లో భారీగా నిధులు లభిస్తున్నాయి. ప్రాథమిక సౌకర్యాలు, విద్యాసంస్థలకు కేంద్రం సహకరిస్తోంది. అంతేగాక కేంద్రం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో రాష్ట్రాల్లో ఎన్ డీఏ భాగస్వామ్య పక్షాల భాగస్వామ్యం ఉంటుంది. వివిధ పరిశ్రమలు రావడానికి కేంద్రం మద్దతు లభిస్తుంది. ఎన్ డీఏ ప్రభుత్వంలో శాంతిభద్రతలు ఉండటంతో పెద్దఎత్తున అభివృద్ధి సాధించడానికి ఆస్కారమేర్పడుతుంది.

ప్రభుత్వాల కొనసాగింపు చాలా ముఖ్యం. గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వాల కొనసాగింపు వల్ల పెద్దఎత్తున అభివృద్ధి సాధించారు. బీహార్ లో జంగిల్ రాజ్ పాలన పోయి నితీష్ కుమార్ ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు బాగా పాట్నా ఎంతో అభివృద్ధి సాధించిందని బీహార్ ఇండస్ట్రీ అసోసియేషన్ నాయకులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో మా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త నినాదం ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే మైక్రో, స్మాల్, మీడియా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు.

బీహార్ లో ఒక పార్టీ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెబుతోంది. ఆచరణ సాధ్యం కాని హామీలను బీహార్ యువత నమ్మవద్దు. ఎన్ డీఏ భాగస్వామిగా చెబుతున్నాం. రాష్ట్రాలు బలంగా ఉంటేనే భారతజాతి బలోపేతమవుతుంది. ప్రధాని మోడీజీ బీహార్ రూపరేఖలు మార్చేశారు. డబుల్ ఇంజన్ సర్కారు కారణంగానో బీహార్, ఏపీలకు కేంద్రంనుంచి పెద్దఎత్తున నిధులు లభిస్తున్నాయని మంత్రి లోకేష్ చెప్పారు. సమావేశంలో బీహార్ స్టేట్ మీడియా విభాగం హెడ్, ఎమ్మెల్సీ సంజయ్ మయూక్, పార్లమెంటు సభ్యుడు సానా సతీష్, గంటి హరీష్, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు నిర్వహించారు.

You Might Also Like

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird