Home Latest News కంచి ఆలయంలో కలకలం.. బల్లుల విగ్రహాల తాపాలు మార్చారా? | కంచి ఆలయంలో కలకలం| బల్లులు ఉన్నాయి| మారిన ఆవాసాలు| పోలీసు – ACPS NEWS

కంచి ఆలయంలో కలకలం.. బల్లుల విగ్రహాల తాపాలు మార్చారా? | కంచి ఆలయంలో కలకలం| బల్లులు ఉన్నాయి| మారిన ఆవాసాలు| పోలీసు – ACPS NEWS

by Admin_swen
0 comments
కంచి ఆలయంలో కలకలం.. బల్లుల విగ్రహాల తాపాలు మార్చారా? | కంచి ఆలయంలో కలకలం| బల్లులు ఉన్నాయి| మారిన ఆవాసాలు| పోలీసు

నవంబర్ 7, 2025 8:51AMన పోస్ట్ చేయబడింది


ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్‌లో బల్లుల విగ్రహాలకు ఉన్న తాపాలను మార్చినట్లు వస్తున్న ఆరోపణలను సంచలనం సృష్టిస్తున్నాయి. కంచి ఆలయంలోని బంగారు, వెండి బల్లుల విగ్రహాల తాపాలను మార్చినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాంచీపరంలోని వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో పురాతన బంగారు, వెండి బల్లుల తాపాలను మార్చేసి వాటి స్థానంలో కొత్త తాపాలను ఏర్పాటుచేశారని శ్రీరంగానికి చెందిన రంగరాజ నరసింహ ఫిర్యాదు చేశారు.

దీంతో విగ్రహాల అక్రమ తరలింపు నిషేధ విభాగం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈనేపథ్యంలో ఆలయ ఈవో రాజ్యలక్ష్మిని పోలీసులు దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించారు. ఆలయంలోని ఇతర సిబ్బందిని కూడా ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అవసరమైనప్పుడు విచారణకు రావాలని ఆలయ ఈవో, సిబ్బంది పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
108 దివ్య క్షేత్రాల్లో ఒకటైన కాంచీపురంలోని ఈ ప్రసిద్ధ వరదరాజస్వామి ఆలయంలో బంగారు, వెండి బల్లులు విశిష్టమైనవి. నిత్యం ఈ ఆలయాన్ని దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వచ్చే భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడి బంగారు, వెండి బల్లులను తాకితే దోషనివారణ జరుగుతుందన్నది భక్తుల విశ్వాసం. పురాణ గాథ ప్రకారం.. గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. వారు నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో ఓ బల్లి పడింది. ఆ పరిశీలన శిష్యులు గుర్తించలేదు.

అది చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాప విముక్తి కోసం శిష్యులు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలోనే మీకు విముక్తి లభిస్తుందని చెప్పారు. దీంతో వారు పెరుమాళ్‌ ఆలయంలోనే బల్లుల రూపంలో వుండి స్వామి వారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఆ సమయంలో సూర్య, చంద్రులు సాక్ష్యులుగా ఉన్న బంగారు, వెండి రూపాల్లో శిష్యుల శరీరాలు బల్లుల బొమ్మలుగా వుండి స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు దోష నివారణ చేయమని మహర్షి ఆదేశిస్తాడు. బంగారం అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని అర్థం చెబుతారు.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird