
నవంబర్ 6, 2025 9:15AMన పోస్ట్ చేయబడింది

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కడపలోని అమీన్పీర్ దర్గాలో సందడి చేశారు. దర్గా ఉర్సు ఉత్సవాలలో భాగంగా తొలి రోజు గురువారం (నవంబర్ 6) ప్రధాన ముజావర్ అరిదుల్లా హుసైనీ నివాసం నుంచి గంధం ఊరేగింపు జరిగింది. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మతాలకు అతీతంగా భక్తులు ఆ దర్గాకు ఉర్సు మహోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సెలబ్రిటీలతో పాటు చాలామంది రాజకీయ నాయకులు హాజరవుతారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా దర్గా ఉరుసు ఉత్సవాల నేపథ్యంలో అధికారులు పటిష్టంగా ఏర్పాటు చేశారు. పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేని ఇంటి నుంచి బుధవారం (నవంబర్ 5)రాత్రి మేళ తాళాల నడుమ గంథాన్ని పీఠాధిపతి ఊరేగింపుగా తీసుకుని దర్గాలోని మజర్ వద్ద ఉంచి ప్రార్థనలు నిర్వహించారు. ప్రముఖ సంగీత మాంత్రికుడు ఏ ఆర్ రెహమాన్ ఏటా ఈ ఉరుసు ఉత్సవాలలో గంధం రోజు తప్పకుండా పాల్గొంటారు .ఈ ఏడాది జరిగే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు ఉంటుంది. ఈ సందర్భంగా ఏఆర్ రెహ్మాన్ కడప పెద్ద దర్గా లో పీఠాధిపతి తో అరీఫుల్లా హుస్సేనితో కలిసి ప్రార్ధనలు చేశారు.
