Home Latest News ప్రతిపక్ష హోదా కోసం జగన్ వృధా ప్రయాస | ప్రతిపక్ష హోదా కోసం జగన్ ప్రయత్నం వృధా అంటున్న ఉండవల్లి| తప్పక| హాజరు – ACPS NEWS

ప్రతిపక్ష హోదా కోసం జగన్ వృధా ప్రయాస | ప్రతిపక్ష హోదా కోసం జగన్ ప్రయత్నం వృధా అంటున్న ఉండవల్లి| తప్పక| హాజరు – ACPS NEWS

by Admin_swen
0 comments
ప్రతిపక్ష హోదా కోసం జగన్ వృధా ప్రయాస | ప్రతిపక్ష హోదా కోసం జగన్ ప్రయత్నం వృధా అంటున్న ఉండవల్లి| తప్పక| హాజరు

నవంబర్ 4, 2025 2:53PMన పోస్ట్ చేయబడింది


ప్రజలు ఇవ్వకపోయినా విపక్ష హోదా కోసం నానాయాగీ చేస్తూ, మంకుపట్టు పట్టి ప్రజల దృష్టిలో మరింత చులకన అవుతున్న జగన్ మోహన్ రెడ్డికి ఆయన చేస్తున్నదంతా వృధాప్రయాసేనని తెలియదా? వైసీపీ లో అంత విషయజ్ఞానం ఉన్న వారు ఎవరూ ఈ సంగతిని ఆయనకు చెప్పడానికి ధైర్యం చేయలేకపోతున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కేవలం అహంభావంతో ఆయన విపక్ష హోదా కోసం పట్టుబడుతున్నారనీ, ఏం చేసినా ఆయనకు విపక్ష నేత హోదా కానీ, ఆయన పార్టీకి విపక్ష పార్టీ కానీ వచ్చే అవకాశాలు లేవనీ పరిశీలకులు అంటున్నారు. అయితే తాజాగా జగన్ కు అత్యంత బలమైన మద్దతుదారు అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా విపక్ష హోదా కోసం జగన్ పడుతున్న తాపత్రయం అనవసరమని అన్నారు. ఎంత పాకులాడినా ఆయనకు విపక్ష నేత హోదా వచ్చే అవకాశం లేదనీ, ఆ విషయంలో జగన్ చేస్తున్నదంతా వృధా ప్రయాసేనని కుండబద్దలు కొట్టారు.

రాజ్యాంగబద్ధంగా రాణి…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదని ఉండవల్లి విస్పష్టంగా చెప్పారు. అయినా ప్రజా సమస్యలపై పోరాడేందుకు ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని ఉండవల్లి అన్నారు. జగన్ ఎంత త్వరగా గుర్తిస్తే ఆయనకు రాజకీయంగా అంత మేలు జరుగుతుందని అంటున్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కనుకే తాను అసెంబ్లీకి రావడం లేదని జగన్ అంటున్నా.. ఉండవల్లి చెబుతున్నదాన్ని బట్టి సీఎంగా చక్రం తిప్పిన అసెంబ్లీలో ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యేగా కూర్చోవడానికి జగన్ కు అహం అడ్డొస్తోందని, ఆ కారణంగానే ఆయన అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార తెలుగుదేశం కూడా జగన్ కేవలం అహంభావంతో మాత్రమే అసెంబ్లీని బాయ్ కాట్ చేశారని విమర్శిస్తున్నారు.
జగన్ అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో తమ పార్టీకి ఉన్న 151 మంది సభ్యుల బలం చూసుకుని సభలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అందరినీ అవమానించిన జగన్ ఇప్పుడు అదే మర్యాద జరుగుతుందన్న భయంతోనే ప్రతిపక్ష హోదా నెపంతో సభకు గైర్హాజరు అవుతున్నారని అధికార పార్టీ అంటున్నది.

ఇప్పుడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అధికారపార్టీ అంటున్నదే రైట్ అన్నారని భావించాల్సి వస్తోంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానడం విడ్డూరంగా ఉందంటూ ఉండవల్లి. అధికార పక్ష సభ్యుల తీరు నచ్చకుంటే సభ నుంచి వాకౌట్ చేయడం సాధారణమని, కానీ మొత్తంగా సభకే గైర్హాజరవడం అనుచితమని, ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదనీ అన్నారు. మరి ఇప్పటికైనా జగన్ కు జ్ఞానోదయం అవుతుందా చూడాల్సిందే!

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird