
అక్టోబర్ 30, 2025 6:37PMన పోస్ట్ చేయబడింది

తెలంగాణ కేబినెట్ లో అజరుద్దీన్ చేరనున్నారు. రేవంత్ కేబినెట్ లో అజరుద్దీన్ చేరికకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం 12గంటల 15 నిమిషాలకు అజరుద్దీన్ మంత్రగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో ఆయన చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అలాగే అజరుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోడానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు తెలిపారు.
ఇలా ఉండగా అజారుద్దీన్కి హోం లేదా మైనారిటీ మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశం విశ్వసనీయంగా తెలియవస్తోంది. గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీగా ఆయనను నామినేట్ చేసి ఇప్పుడు కేబినెట్లోకి తీసుకుంటున్నారు. కాగా జూబ్లీ ఉప ఎన్నిక వేళ అజరుద్ధీన్కు మంత్రి పదవి ఇవ్వటాన్ని చేస్తూ బీజేపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో మంత్రి పదవి ఇవ్వడం ఒక వర్గం ఓటర్లను ఇప్పుడు ప్రభావితం చేయడానికేనని ఆరోపించింది. అయితే బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. మైనారిటీ వర్గాలకు మంత్రిపదవి ఇస్తుంటే బీజేపీకి అభ్యంతరం ఎందుకని డిప్యూటీ సీఎం మల్లుభట్టివిక్రమార్క అన్నారు. అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. అయితే అజరుద్దీన్ కు మంత్రిపదవిపై బీజేపీ అభ్యంతరాలు తెలుపుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ను కేబినెట్ లోకి ఆదర్శంగా, బీజేపీ, బీఆర్ఎస్ లు అడ్డుకోవాలని చూస్తున్నాయి. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అయిన అజరుద్దీన్ సుదీర్ఘకాలం దేశానికి అందించారు. రాజస్థాన్ లో ఉప ఎన్నిక అభ్యర్థి ని బీజేపీ గతంలో మంత్రిని చేసిందని గుర్తు చేశారు. శ్రీ గంగానగర్ జిల్లా శ్రీ కరణ్ పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా ఉన్న సురేంద్ర పాల్ సింగ్ ను ఉప ఎన్నికకు సరిగ్గా 20 రోజుల ముందు మంత్రిని చేసిందని, అటువంటి బీజేపీ ఇప్పుడు అజరుద్దీని మంత్రిని చేస్తే ఎందుకు అభ్యంతరం పెడుతోందని ప్రశ్నించారు. మంత్రిగా అజారుద్దీన్ మైనార్టీల శ్రేయస్సుకోసం కృషి చేస్తార’న్న నమ్మ’క’మున్నారు.
