
[ad_1]

రామ్ చరణ్ (రామ్ చరణ్), ఉపాసన (ఉపాసన) దంపతులు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. వారు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ సూచన తెలుపుతూ ఈ దీపావళికి డబుల్ సెలబ్రేషన్ అంటూ ఉపాసన సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఉపాసన సీమంతం వేడుకకు సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై ఉపాసనను ఆశీర్వదించారు. అందులో వెంకటేష్, నాగార్జున, నయనతార వంటి స్టార్స్ ఉన్నారు.
ఇక రామ్ చరణ్, ఉపాసనకి కావల పిల్లలు పుట్టబోతున్నారు. ఈ అధికారికంగానే ధ్రువీకరించారు. చరణ్, ఉపాసన వివాహం 2012లో జరిగింది. 2023లో వీరికి పాప పుట్టింది. పాప పేరు క్లీంకార. ఇప్పుడు బాబు పుడితే బాగుంటుందని, మెగా వారసుడు వస్తాడని అభిమానులు ఆశపడుతున్నారు. చిరంజీవి (చిరంజీవి) కోరిక కూడా అదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ మనవరాళ్లే అయ్యారని, ఓ మనవడు ఉంటే బాగుంటుందని గతంలో ఒక ఈవెంట్లో చిరంజీవి తన మనసులోని మాట బయటపెట్టారు. మరి ఇప్పుడు కావల పిల్లలు పుట్టబోతున్నారు కాబట్టి, చిరంజీవి కోరుకున్నట్టుగా ఒక మనవడా, లేక ఇద్దరు మనవళ్ళా, లేక కవలలలో ఎవరు పుడతారనే చర్చ అభిమానుల్లో జరుగుతుంది.
[ad_2]