
అక్టోబర్ 17, 2025 2:43PMన పోస్ట్ చేయబడింది

భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలు శుక్రవారం ముఖ్యమంత్రిని రాష్ట్ర సచివాలయంలో కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థినీ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలకు సీఎం చంద్రబాబు సర్టిఫికెట్లను అందించి వారితో కొద్దిసేపు ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్నారా? అని వారిని సీఎం అడిగారు. నిత్యావసరాల్లోని చాలా వస్తువులు సున్నా శాతం, 5 శాతం స్లాబ్ పరిధిలోకి వస్తున్నాయని, దీని వల్ల చాలా వరకు ధరలు తగ్గుతాయని విద్యార్థులు చెప్పారు.
నాటిన కొంత కాలానికి చెట్టు ఫలాలు ఇచ్చిన సంస్కరణలను ఇప్పుడు అమలు చేస్తే కొన్ని తర్వాత ఆ ఫలితాలు ప్రజలకు అందేలా చంద్రబాబు వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. జీఎస్టీ వంటి సంస్కరణలను అర్థం చేసుకుని వాటిపై వ్యాసరచన. పెయింటింగ్, వక్తృత్వ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచి నందుకు ఆయన వారిని అభినందించారు.