
డిసెంబర్ 29, 2025 6:32PMన పోస్ట్ చేయబడింది
.webp)
వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుమలలో రేపాటి నుంచి ప్రారంభం కానున్న వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. టీటీడీ సీఈఎస్వో, జిల్లా ఎస్పీ, చీఫ్ ఇంజినీర్, పలు విభాగాల అధికారులు టీటీడీ చైర్మన్ వెంట ఉన్నారు. శిలాతోరణం, కృష్ణతేజ, ఏటీజీహెచ్, ఎంట్రీ పాయింట్లు వద్ద క్షేత్రస్థాయిలో సౌకర్యాలను వారు పరిశీలించారు.
వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో 1.89 లక్షల టోకెన్లను ఈ-డిప్ ద్వారా టీటీడీ కేటాయించింది. టోకెన్లు ఉన్న భక్తులకే ఆ మూడు రోజుల్లో దర్శనం కల్పించనున్నారు. ఎంట్రీ పాయింట్స్ వద్ద టోకెన్ స్కానింగ్ ప్రక్రియను ఛైర్మన్కు అధికారులు వివరించారు. క్యూ ఎంట్రీ వద్ద భక్తులకు సౌకర్యాల ఏర్పాటును ఆయన తనిఖీ చేశారు. టోకెన్లు ఉన్న భక్తులకే దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు
