Home Latest News కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామ్ తో చంద్రబాబు భేటీ.. ఎక్కడంటే? | గన్నవరం విమానాశ్రయంలో నిర్మలా సీతారామన్‌ను కలిసిన cbn| యూనియన్| ఆర్థిక| మంత్రి| చర్చించు| రాష్ట్రం – ACPS NEWS

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామ్ తో చంద్రబాబు భేటీ.. ఎక్కడంటే? | గన్నవరం విమానాశ్రయంలో నిర్మలా సీతారామన్‌ను కలిసిన cbn| యూనియన్| ఆర్థిక| మంత్రి| చర్చించు| రాష్ట్రం – ACPS NEWS

by Admin_swen
0 comments
కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామ్ తో చంద్రబాబు భేటీ.. ఎక్కడంటే? | గన్నవరం విమానాశ్రయంలో నిర్మలా సీతారామన్‌ను కలిసిన cbn| యూనియన్| ఆర్థిక| మంత్రి| చర్చించు| రాష్ట్రం

డిసెంబర్ 29, 2025 8:26AMన పోస్ట్ చేయబడింది


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఆమెతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి సహకారం, బడ్జెట్ లో ప్రాధాన్యత వంటి అంశాలు చంద్రబాబు ఆమెతో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం చంద్రబాబు కృష్ణా జిల్లా పెద్దఅవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కంభంపాటి తల్లి వెంకటనరసమ్మ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కంభంపాటి రామ్మోహనరావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. వెంకటనరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird