Home సినిమా ప్రజాకవి అందెశ్రీ కన్నుమూత! – ACPS NEWS

ప్రజాకవి అందెశ్రీ కన్నుమూత! – ACPS NEWS

by
0 comments
ప్రజాకవి అందెశ్రీ కన్నుమూత!



ప్రముఖ ప్రజాకవి, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ (అండే శ్రీ) కన్నుమూశారు. 64 ఏళ్ళ అందెశ్రీ కొత్తకాలం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు(సోమవారం) తెల్లవారుజామున తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోవడంతో.. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి సందర్శించారు. ఇప్పటికే అందెశ్రీ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు పేర్కొన్నారు.

ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన అందెశ్రీ.. జనగాం వద్ద గల రేబర్తి అనే గ్రామంలో 1961, జులై 18న జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాల గేయరచన చేసారు. పాఠశాలకు వెళ్ళి చదువుకోకపోయినా.. తన పాటలతో ఎందరినో చైతన్యపరిచారు. అందెశ్రీ ఆశ కవిత్వం చెప్పటంలో దిట్ట.

అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన రచించిన ‘జయ జయహే తెలంగాణ’ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు.. 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా రూ.కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నారు అందెశ్రీ.

నారాయణ మూర్తి నటించిన పలు విప్లవాత్మక సినిమాల విజయం వెనుక అందెశ్రీ పాటలున్నాయి. ‘మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు’, ‘సుడ సక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి’, ‘పల్లెనీకు వందనములమ్మో’, ‘జన జాతరలో మన గీతం’ వంటి పాటలు అందెశ్రీకి మంచి పేరు తెచ్చాయి.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird