
అక్టోబర్ 28, 2025 7:02PMన పోస్ట్ చేయబడింది

డిప్ ఫేక్ లో తన ఫోటోలు వీడియోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ ను కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే… అయితే ఏఐ యుగంలో భద్రతా పదం మీకు అతి పెద్ద రక్షణ అంటూ వీసీ సజ్జనార్ తన ఎక్స్ లో ట్వీట్ చేశారు.
నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ఫేక్ యుగంలో, సాంకే తికత అద్భుతాలు చూపుతున్నప్పటికీ మోసగాళ్లకు కూడా కొత్త మార్గాలు దొరికాయి… ఇప్పుడు ఏఐ టూల్స్ సహాయంతో మీ ముఖం అచ్చుగుద్దినట్లు క్లోన్ చేస్తోంది. ఈ సాంకేతిక తను కొంతమంది మోసగాళ్లు దుర్వినియోగం చేస్తూ స్నేహితుడు, సహోద్యోగి లేదా అధికారిగా నటిస్తూ అమాయకులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్ప డినట్లు అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ హైదరాబాద్ సీపీ కొన్ని సూచనలు చేశారు.
మీ రక్షణ కోసం ‘సేఫ్ వర్డ్’ ఏర్పాటు చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఒక ప్రత్యేకమైన ‘సేఫ్ వర్డ్’ (భద్రతా పదం) నిర్ణయించుకోండి. అనుమానాస్పదమైన కాల్స్ లేదా ఫోన్ కి సందేశం వచ్చినప్పుడు ఆ పదం ద్వారా నిజసత్యం ధృవీకరించండి.
మీ వ్యక్తిగత ఫోటోలు కానీ వీడియోలు కానీ లేదా ఆర్థిక వివరాలు ఎప్పుడూ ఎవరితోనూ కూడా పంచుకోవద్దని సీపీ సూచిం చారు. ఏఐ మనకు శక్తినిస్తుంది. కానీ అదే సమయంలో ప్రమాదంలోకి నెట్టగలదు….మన అప్రమత్తతే మనకు రక్షణ….అంటూ హైదరాబాద్ వీసీ సజ్జనార్ తన ఎక్స్ లో ట్వీట్ చేస్తూ అందర్నీ అప్రమత్తం గా ఉండాలంటూ సూచించారు.
