
అక్టోబర్ 22, 2025 8:18PMన పోస్ట్ చేయబడింది

మేడ్చల్ జిల్లా పోచారంలో కాల్పుల కలకలం రేగింది. సోనుసింగ్ అనే వ్యక్తిపై దుండగుడు కాల్పులు జరిపి పరారయ్యాడు. గాయపడిన సోనుసింగ్ను స్థానికులు ఆసుపత్రికి. ఈ విషయం తెలుసుకున్న ఐటీ కారిడార్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కాల్సుల జరిపిన వ్యక్తి ఇబ్రహీంగా పేర్కొన్నారు. కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. హైదరాబాద్ నగరంలో ఇటీవల నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఓ వైపు డ్రగ్స్ దందా సాగుతుండగా.. హత్యలు క్రైమ్ రేటు సైతం పెరిగిపోయింది. గతంలో దోపిడీ దొంగలు గన్లతో బెదిరించి చందానగర్లో ఓ గోల్డ్ షాపులో చోరీ చేశారు. ఇటీవల మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి వద్ద బుల్లెట్ దొరకడం కలకలం రేపింది. తాజాగా పోచారంలో కాల్పులు జరగడంతో శాంతిభద్రతలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా గన్ కల్చర్ పెరుగుతుండటంపై సామాన్య ప్రజలు ఆందోళన చేస్తున్నారు.
